ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 29, బుధవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,49,314 కు చేరుకుంది. గత 24 గంటల్లో 57,345 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా, 1084 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. కొత్తగా తూర్పుగోదావరి జిల్లాలో 244, చిత్తూరు జిల్లాలో 147, ప్రకాశం జిల్లాలో 122, నెల్లూరు జిల్లాలో 115, కృష్ణా జిల్లాలో 113, గుంటూరు జిల్లాలో 111, పశ్చిమగోదావరిలో 96, కడప జిల్లాలో 71, విశాఖపట్నం జిల్లాలో 28, శ్రీకాకుళం జిల్లాలో 18, అనంతపూర్ జిల్లాలో 14, విజయనగరంలో 5, కర్నూల్ జిల్లాలో 0 కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రంలో మరో 13 మరణాలు నమోదవడంతో మొత్తం మరణాల సంఖ్య 14163 కి పెరిగింది. మరోవైపు గడిచిన 24 గంటల్లో 1,328 మంది కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 20,23,496 కు చేరింది. అలాగే ప్రస్తుతం 11,655 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇక సెప్టెంబర్ 29 నాటికీ ఏపీలో మొత్తం 2,82,35,650 కరోనా పరీక్షలను నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ