ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష(పాలిసెట్)-2021 ఫలితాలు ఇటీవల విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాలిటెక్నిక్ ప్రవేశాల ప్రక్రియ సంబంధించిన నోటిఫికేషన్ బుధవారం విడుదలైంది. అక్టోబర్ 6 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. అక్టోబర్ 11న సీట్లు కేటాయింపు, అక్టోబర్ 18 నుంచి పాలిటెక్నిక్ విద్యార్ధులకి తరగతులు ప్రారంభం కానున్నట్టు తెలిపారు. ముందుగా సెప్టెంబర్ 1న జరిగిన పాలిసెట్-2021 పరీక్షకు మొత్తం 68,138 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 91.20 శాతం అనగా 64,187 మంది ఉత్తీర్ణత సాధించారు. ఏపీలో మొత్తం 70 వేలపైగానే పాలిటెక్నిక్ సీట్లు అందుబాటులో ఉన్నాయి.
ఏపీ పాలిసెట్-2021 ప్రవేశాల షెడ్యూల్:
- అక్టోబర్ 6 వరకు ఆన్లైన్లో దరఖాస్తు
- అక్టోబర్ 3 నుంచి 7 వరకు సర్టిఫికెట్ల పరిశీలన
- అక్టోబర్ 3 నుంచి 8 వరకు వెబ్ ఆప్షన్స్
- అక్టోబర్ 9 న వెబ్ ఆప్షన్స్ మార్చుకునే అవకాశం
- అక్టోబర్ 11 న సీట్లు కేటాయింపు
- అక్టోబర్ 12 నుంచి 18 వరకు కాలేజ్ లో రిపోర్ట్
- అక్టోబర్ 18 నుంచి పాలిటెక్నిక్ విద్యా సంవత్సరం ప్రారంభం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ