ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి ఫలితాలు నేడు విడుదల అయ్యాయి. ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విజయవాడలో విడుదల చేశారు. విద్యార్థులు తమ ఫలితాలను www.bse.ap.gov.in వెబ్సైట్ లో చూసుకోవచ్చని తెలిపారు. ముందుగా రాష్ట్రంలో కరోనా పరిస్థితుల నేపథ్యంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అనంతరం ఫలితాలకు సంబంధించి మార్గదర్శకాల రూపకల్పన కోసం హైపవర్ కమిటీని ఏర్పాటు చేశారు. హైపవర్ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా విద్యార్థులకు గ్రేడ్లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో 2021 జూన్కు సంబంధించిన విద్యార్థులతో పాటుగా, 2020 మార్చి విద్యార్థులకు కూడా సబ్జెక్టుల వారీగా ప్రతిభ ఆధారంగా గ్రేడ్లు కేటాయిస్తూ ఫలితాలను విడుదల చేశారు.
మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ, పదో తరగతి పరీక్షల మార్కులు చాలా ఉద్యోగులకు ప్రామాణికంగా ఉంటాయని అన్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు గ్రేడ్లు కావాలని విజ్ఞప్తి చేశారని చెప్పారు. దీంతో హైపవర్ కమిటీ ఏర్పాటు చేయగా, వారు అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి నివేదిక ఇచ్చారన్నారు. విద్యార్థుల ప్రతిభను ప్రధానంగా తీసుకుని ఎవరికీ నష్టం జరగకుండా, రాబోయే రోజుల్లో విద్యార్థులకు ఇబ్బందులు రాకుండా గ్రేడింగ్ ఇచ్చేలా నివేదిక ఇచ్చారని చెప్పారు. రెండు విద్యాసంవత్సరాలకు సంబంధించి గ్రేడ్లతో ఫలితాలను ప్రకటిస్తున్నామన్నారు. గ్రేడ్స్ తో పాటుగా మార్కుల మెమోలు కూడా వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచామని మంత్రి తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ