ఏపీలో కరోనా: కొత్తగా 1145 పాజిటివ్ కేసులు, 17 మరణాలు నమోదు

Andhra Pradesh, AP Corona Cases, AP Corona Positive Cases, AP Coronavirus, AP COVID 19 Cases, AP Total Positive Cases, Corona Positive Cases, Coronavirus, Coronavirus state-wise count in India, COVID-19, State wise Corona Positive Cases, State-wise Corona Positive Cases List in India, telangana, Telangana Coronavirus, Telangana Coronavirus Death

ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 49,581 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 1,145 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. అత్యధికంగా తూర్పుగోదావరిలో 216, నెల్లూరులో 173, చిత్తూరులో 132, కృష్ణాలో 128, ప్రకాశంలో 117, కడపలో 111 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,28,795 కు చేరుకుంది.

ఇక కరోనా వలన మరో 17 మరణాలు చోటుచేసుకున్నాయి. చిత్తూరులో నలుగురు, కడపలో ముగ్గురు, నెల్లూరులో ముగ్గురు, కృష్ణాలో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, తూర్పుగోదావరిలో ఒకరు, గుంటూరులో ఒకరు, శ్రీకాకుళంలో ఒకరు మరణించారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 13987 కి పెరిగింది. గత 24 గంటల్లో 1,090 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 19,99,651 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 15,157 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × two =