జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్డ్-2021 పరీక్ష దరఖాస్తుల ప్రక్రియ వాయిదా పడింది. ముందుగా సెప్టెంబర్ 11 నుంచి జేఈఈ అడ్వాన్స్డ్-2021 కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభం కావాల్సి ఉండగా, జేఈఈ మెయిన్ ర్యాంకుల వెల్లడిలో జాప్యం వలన ఆ ప్రక్రియ వాయిదా వేయబడిందని ఇనిస్టిట్యూట్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఖరగ్పూర్ వెల్లడించింది. కాగా సెప్టెంబర్ 13వ తేదీ మధ్యాహ్నం రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండగా, సెప్టెంబర్ 19వ తేదీ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఫీజు చెల్లింపునకు సెప్టెంబర్ 20వ సాయంత్రం 5 వరకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
జేఈఈ మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించిన టాప్ 2.5 లక్షల మంది అభ్యర్థుల మాత్రమే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. దరఖాస్తు అనంతరం అడ్మిట్ కార్డ్స్ సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 3 వరకు అభ్యర్థులకు అందుబాటులో ఉండనున్నాయి. ఇక అక్టోబర్ 3వ తేదీన రెండు షిఫ్ట్లలో జేఈఈ అడ్వాన్స్డ్-2021 పరీక్షను నిర్వహించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ