జగనన్న గోరుముద్ద పథకంలోకి ఏపీ ప్రభుత్వం పోషకాహారమైన ‘రాగి జావ’ ను చేరింది. ఇకపై రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్న భోజన పథకమైన జగనన్న గోరుముద్దలో భాగంగా బడి పిల్లలకు వారానికి మూడు రోజులు ఉదయం పూట రాగిజావను అందించనున్నారు. పిల్లలకు రాగి జావను అందించే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్గా ప్రారంభించారు. ఈ నేపథ్యంలో రాగిజావ అందించడంపై సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
“పౌష్టికాహారంతోనే ఆరోగ్యం, చక్కటి విద్యాభ్యాసం సాధ్యమని నమ్ముతూ ఒక మేనమామగా మధ్యాహ్న భోజన కార్యక్రమం “గోరుముద్ద”లో భాగంగా ఇవ్వాళ్టి నుంచి రాగిజావ అందిస్తున్నాం. గుడ్డు, చిక్కీ సహా అందిస్తున్న 15 ఆహార పదార్థాలకు ఇది అదనం. భాగస్వామి అయిన సత్యసాయి ట్రస్టుకు నా ధన్యవాదాలు” అని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE