ఆంధ్రప్రదేశ్ దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి నిర్వహించిన శాఖలను ఇతర మంత్రులకు బదలాయించారు. వచ్చేవారం అసెంబ్లీ సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాలలో ఆయా శాఖలకు సంబంధించిన వ్యవహారాలను కొత్తగా బాధ్యతలు తీసుకున్న మంత్రులు చూడనున్నారు. మంత్రి సీదిరి అప్పలరాజుకు ఐటీ, పరిశ్రమలు, స్కిల్ డెవలప్మెంట్ శాఖలు కేటాయించారు. మంత్రి కురసాల కన్నబాబుకు జీఏడీ శాఖని ఇచ్చారు. అలాగే, మంత్రి ఆదిమూలపు సురేష్కు లా అండ్ జస్టిస్ శాఖని అప్పగించారు. మరో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డికి పబ్లిక్ ఎంటర్ప్రైజేస్, ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ విభాగాలు కేటాయించారు. ఇప్పటినుంచి ఈ శాఖల నిర్వహణ ఆయా మంత్రుల పర్యవేక్షణలోనే కొనసాగుతుందని ఏపీ అధికార వర్గాలు తెలిపాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ