ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకి కరోనా వైరస్ పాజిటివ్ కేసుల నమోదు పెరుగుతుంది. ఈ నేపథ్యంలో జనవరి 26, బుధవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 22,22,573 కు చేరుకుంది. గత 24 గంటల్లో 49,143 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా, 13,618 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. కొత్తగా విశాఖపట్నం జిల్లాలో 1791, అనంతపూర్ జిల్లాలో 1650, గుంటూరు జిల్లాలో 1464, కర్నూల్ జిల్లాలో 1409, ప్రకాశం జిల్లాలో 1295, నెల్లూరు జిల్లాలో 1007, తూర్పుగోదావరి జిల్లాలో 961, కడప జిల్లాలో 907, కృష్ణా జిల్లాలో 803, పశ్చిమగోదావరిలో 728, శ్రీకాకుళం జిల్లాలో 644, చిత్తూరు జిల్లాలో 493, విజయనగరంలో 466 కేసులు నమోదయ్యాయి.
ఇక రాష్ట్రంలో కరోనా వలన మరో తొమ్మిదిమంది మరణించడంతో, మొత్తం మరణాల సంఖ్య 14570 కి పెరిగింది. మరోవైపు గడిచిన 24 గంటల్లో 8,687 మంది కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 21,01,685 కు చేరింది. అలాగే ప్రస్తుతం 1,06,318 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇక జనవరి 26 నాటికీ ఏపీలో మొత్తం 3,22,83,369 కరోనా పరీక్షలను నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ