ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకు ఒక్క పైసా ఖర్చు లేకుండా వ్యవసాయ మోటార్లకు విద్యుత్ పంపిణీ సంస్థలే మీటర్లు బిగిస్తాయని తెలిపారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. బుధవారం ఆయన తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఇంధన శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, ఏపీ జెన్కో ఎండీ శ్రీధర్ సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ అధికారులకి పలు కీలక సూచనలు చేశారు.
సమీక్షలో సీఎం జగన్ చేసిన కొన్ని సూచనలు..
- రాష్ట్రంలో రైతులకు ఒక్కపైసా కూడా ఖర్చు కాకుండా విద్యుత్ పంపిణీ సంస్థలే మీటర్లను బిగిస్తాయి.
- రైతుల వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ పంపిణీ అత్యంత పారదర్శకంగా, నాణ్యంగా ఉండాలి.
- మీటర్లు పెట్టడం వల్ల కలుగుతున్న ప్రయోజనాలపై ఎప్పటికప్పుడు రైతులకు తెలియజేయాలి.
- వినియోగించుకున్న విద్యుత్కు అయ్యే ఖర్చును కూడా నేరుగా రైతుల ఖాతాల్లోకి పంపుతారు.
- వారి ఖాతాలనుంచి ఆ డబ్బు నేరుగా విద్యుత్ పంపిణీ సంస్థలకు చేరుతుంది. దీనిపై రైతులకు అవగాహన కల్పించాలి.
- ఈ ప్రక్రియ కారణంగా విద్యుత్ పంపిణీ సంస్థలు రైతులకు జవాబుదారీగా ఉంటాయి.
- శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన పైలట్ ప్రాజెక్టు విజయవంతం అయింది.
- మోటార్ల వాళ్ళ విద్యుత్ ఆదా అయ్యి, తద్వారా రైతులకు లబ్ది చేకూరుతోంది.
- రాష్ట్రంలో బొగ్గు నిల్వలకు ఎలాంటి కొరత లేకుండా అధికారులు దృష్టి పెట్టాలి.
- విదేశీ బొగ్గు ధరలు మండిపోతున్న దృష్ట్యా దేశీయంగానే సమకూర్చేకునేలా ప్రయత్నాలు చేయాలి.
- వచ్చే ఏడాది వేసవి కోసం ఇప్పటినుంచే ప్రత్యేక ప్రణాళిక సిద్ధంచేసుకోవాలి.
- సులియారీ, మహానది కోల్బాక్స్ నుంచి పూర్తిస్థాయి ప్రయోజనాలు పొందేలా ప్రయత్నించాలి.
- ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జగనన్న కాలనీల్లో విద్యుత్ సదుపాయాలు, నిర్వహణపై దృష్టి పెట్టాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY