దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. కరోనా మహమ్మారి వెలుగులోకి వచ్చినప్పటినుంచి ఇప్పటివరకు దేశంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య 4 కోట్లు దాటింది. గత 24 గంటల్లో కొత్తగా 2,85,914 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, మొత్తం కేసుల సంఖ్య 4,00,85,116 కు చేరుకుంది. అలాగే కరోనాతో కొత్తగా 665 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 4,91,127 కు పెరిగింది. తాజాగా నమోదైన కేసుల్లో ఎక్కువగా కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్, జమ్మూ అండ్ కశ్మీర్, హర్యానా వంటి రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోనే నమోదయ్యాయి.
ఇక ప్రస్తుతం 22,23,018 (5.55%) మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. కొత్తగా మరో 2,99,073 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 3,73,70,971 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 93.23 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.23 శాతంగా నమోదైంది.
దేశంలో కరోనా కేసులు వివరాలు (జనవరి 26, ఉదయం 8 గంటల వరకు):
- దేశంలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య: 72,05,72,178
- జనవరి 25న నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య : 17,69,745
- మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య : 4,00,85,116
- కొత్తగా నమోదైన కేసులు [ జనవరి 25–జనవరి 26 (8AM-8AM)] : 2,85,914
- నమోదైన మరణాలు : 665
- రికవరీ అయిన వారి సంఖ్య : 3,73,70,971
- యాక్టీవ్ కేసులు : 22,23,018
- మొత్తం మరణాల సంఖ్య : 4,91,127
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ