ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 62,252 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 1,445 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. అత్యధికంగా తూర్పుగోదావరిలో 274, చిత్తూరులో 201, కృష్ణాలో 164, గుంటూరులో 141, ప్రకాశంలో 136, కడపలో 131, పశ్చిమగోదావరిలో 131, నెల్లూరులో 130 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,33,419 కు చేరుకుంది.
ఇక కరోనా వలన మరో 11 మరణాలు చోటుచేసుకున్నాయి. కృష్ణాలో ముగ్గురు, ప్రకాశంలో ముగ్గురు, పశ్చిమగోదావరిలో ఇద్దరు, చిత్తూరులో ఒకరు, కర్నూల్ లో ఒకరు, విశాఖపట్నంలో ఒకరు మరణించారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 14030 కి పెరిగింది. గత 24 గంటల్లో 1,243 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 20,04,786 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 14,603 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ