రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖపై అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని తన కార్యాలయంలో సీఎస్ సోమేష్ కుమార్ తో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఎక్సైజ్ నూతన పాలసీ రూపకల్పనపై సీఎస్ సోమేశ్ కుమార్ తో మంత్రి శ్రీనివాస్ గౌడ్ చర్చించారు. రాష్ట్రంలో సెప్టెంబర్ 30వ తేదీతో బార్ ల లైసెన్సుల గడువు ముగుస్తున్న నేపథ్యంలో 2021-22 సంవత్సరానికి గాను నూతన బార్స్ లైసెన్స్ లకు సంబంధించిన అంశాలపై మంత్రి ప్రధానంగా సమీక్షించారు.
వీటితోపాటు A4 వైన్ షాప్ ల లైసెన్సుల గడువు అక్టోబర్ 31వ తేదీతో ముగిస్తున్న నేపథ్యంలో నవంబర్ 1వ తేది నుండి అమల్లోకి వచ్చే నూతన ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన విధి విధానాలను రూపొందించుటకై మంత్రి ఈ సమీక్ష లో చర్చించారు. ఈ సమీక్షలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నీరా ప్రాజెక్టు నిర్మాణ పనులను వచ్చే రెండు నెలల్లో పూర్తి చేయాలని ఎక్సైజ్ శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ