ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. కొత్తగా 16167 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మే 27, గురువారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 16,43,557 కు చేరింది. కొత్తగా చిత్తూరు (2967), తూర్పుగోదావరి (2325), అనంతపూర్ (1472), విశాఖపట్నం (1434), నెల్లూరు (1137), పశ్చిమగోదావరి (1092), ప్రకాశం (1069) వంటి 7 జిల్లాల్లో 1000కి పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
గత 24 గంటల్లో మరో 21,385 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయినట్టు తెలిపారు. ఇక కరోనా వలన రాష్ట్రంలో మరో 104 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 10531 కి పెరిగింది. గత 24 గంటల్లో 84,224 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా, మొత్తం పరీక్షల సంఖ్య 1,89,24,545 కు చేరుకుంది.
ఏపీలో కరోనా కేసులు వివరాలు (మే 27, ఉదయం 10 గంటల వరకు) :
- రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 16,43,557
- కొత్తగా నమోదైన కేసులు : 16,167
- కొత్తగా నమోదైన మరణాలు : 104
- డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య : 14,46,244
- యాక్టీవ్ కేసులు : 1,86,782
- మొత్తం మరణాల సంఖ్య : 10531
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ