ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకి కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జనవరి 11, మంగళవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,84,674 కు చేరుకుంది. గత 24 గంటల్లో 36,452 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా, 1831 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. కొత్తగా చిత్తూరు జిల్లాలో 467, విశాఖపట్నం జిల్లాలో 295, కృష్ణా జిల్లాలో 190, గుంటూరు జిల్లాలో 164, అనంతపూర్ జిల్లాలో 161, నెల్లూరు జిల్లాలో 129, శ్రీకాకుళం జిల్లాలో 122, తూర్పుగోదావరి జిల్లాలో 84, పశ్చిమగోదావరిలో 57, కర్నూల్ జిల్లాలో 56, ప్రకాశం జిల్లాలో 46, విజయనగరంలో 40, కడప జిల్లాలో 20 కేసులు నమోదయ్యాయి.
ఇక రాష్ట్రంలో కరోనా వలన ఎలాంటి మరణం సంభవించలేదు, దీంతో మొత్తం మరణాల సంఖ్య 14505 కి పెరిగింది. మరోవైపు గడిచిన 24 గంటల్లో 242 మంది కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 20,62,974 కు చేరింది. అలాగే ప్రస్తుతం 7,195 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇక జనవరి 11 నాటికీ ఏపీలో మొత్తం 3,16,66,683 కరోనా పరీక్షలను నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ