ఆంధ్రప్రదేశ్ లో రోజువారీ కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 71,030 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 1,869 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. అత్యధికంగా తూర్పుగోదావరిలో 385, పశ్చిమగోదావరిలో 304, గుంటూరులో 222, నెల్లూరులో 177, చిత్తూరులో 175, కృష్ణాలో 148, కడపలో 133 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19,80,258 కు చేరుకుంది.
ఇక కరోనా వలన మరో 18 మరణాలు చోటుచేసుకున్నాయి. చిత్తూరులో ఐదుగురు, కృష్ణాలో ముగ్గురు, ప్రకాశంలో ముగ్గురు, గుంటూరులో ఇద్దరు, అనంతపూర్ లో ఒకరు, తూర్పుగోదావరిలో ఒకరు, నెల్లూరులో ఒకరు, విశాఖపట్నంలో ఒకరు, పశ్చిమగోదావరిలో ఒకరు మరణించారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 13582 కి పెరిగింది. గత 24 గంటల్లో 2,316 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 19,55,052 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 18,417 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ