ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో ప్రముఖ డైరెక్టర్ రాజమౌళి భేటీ అయ్యారు. తాడేపల్లి లోని సీఎం క్యాంపు కార్యాలయంలో రాజమౌళితో పాటు నిర్మాత డీవీవీ దానయ్య కూడా సీఎం జగన్ ను కలిశారు. అయితే, ఈమధ్యే ఏపీలో సినిమా టికెట్ రేట్ల విషయంలో సవరణలు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈనెల 25న ప్రపంచ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే. దానయ్య నిర్మాణ సారధ్యంలో, దర్శకధీరుడు రాజమౌళి పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్తో రాజమౌళి భేటీ ప్రాధ్యాన్యత సంతరించుకుంది. మొదటివారంలో సినిమా టిక్కెట్ల ధరల వెసులుబాటు, బెనిఫిట్ షోల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని కూడా ఈ కీలక సమావేశానికి హాజరయ్యారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ