ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 90,532 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 2930 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. దీంతో జూలై 3, శనివారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,99,748 కు చేరింది. కరోనా వలన రాష్ట్రంలో మరో 36 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 12815 కి పెరిగింది. ఇక గడిచిన 24 గంటల్లో 4346 మంది కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 18,51,062 కు పెరిగింది. ప్రస్తుతం 35,871 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.
ఏపీలో జిల్లాల వారీగా కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల వివరాలు(2930):
- తూర్పుగోదావరి – 591
- చిత్తూరు – 443
- ప్రకాశం – 363
- పశ్చిమగోదావరి – 338
- గుంటూరు – 236
- కృష్ణా – 204
- నెల్లూరు – 185
- కర్నూల్ – 119
- కడప – 117
- శ్రీకాకుళం – 105
- అనంతపూర్ – 100
- విశాఖపట్నం – 70
- విజయనగరం – 59
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ