కేంద్ర కేబినెట్ విస్తరణలో భాగంగా 43 మంది కొత్త కేంద్రమంత్రుల ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం బుధవారం సాయంత్రం రాష్ట్రపతి భవన్ లో జరిగింది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కొత్త మంత్రులతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. ప్రధాని మోదీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం రెండోసారి తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా కేబినెట్ విస్తరణ చేపట్టారు. 43 మందిలో 15 కేబినెట్ మంత్రులు కాగా, 28 మంది సహాయమంత్రులుగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన 43 మంది వీళ్లే :
కేబినెట్ మంత్రులు:
- జి.కిషన్ రెడ్డి
- నారాయణ టాటూ రాణే
- సర్బానంద్ సోనోవాలా
- డాక్టర్ వీరేంద్ర కుమార్
- జ్యోతిరాదిత్య సింధియా
- రామచంద్ర ప్రసాద్ సింగ్
- అశ్వనీ వైష్ణవ్
- పశుపతి కుమార్ పారస్
- కిరణ్ రిజిజు
- రాజ్ కుమార్ సింగ్
- హర్దీప్ సింగ్ పూరీ
- మన్సుఖ్ మాండవీయ
- భూపేందర్ యాదవ్
- పురుషోత్తం రూపాలా
- అనురాగ్ ఠాకూర్
కేంద్ర సహాయమంత్రులు:
- పంకజ్ చౌధురి
- అనుప్రియా పటేల్
- సత్యపాల్ సింగ్ బాఘేల్
- రాజీవ్ చంద్రశేఖర్
- శోభా కరంద్లాజే
- భానుప్రతాప్ సింగ్ వర్మ
- దర్శన విక్రమ్ జర్దోశ్
- మీనాక్షి లేఖీ
- అన్నపూర్ణా దేవి
- నారాయణ స్వామి
- కౌశల్ కిశోర్
- అజయ్ భట్
- బి.ఎల్.వర్మ
- అజయ్ కుమార్
- చౌహాన్ దేవూసింగ్
- భగవంత్ ఖూబా
- కపిల్ మోరేశ్వర్ పాటిల్
- ప్రతిమా భౌమిక్
- భగవత్ కృష్ణారావు
- సుభాశ్ సర్కార్
- రాజ్కుమార్ రాజన్ సింగ్
- భారతీ పవార్
- విశ్వేశ్వర్ తుడు
- శంతనూ ఠాకూర్
- మహేంద్ర భాయ్
- జాన్ బర్లా
- మురుగన్
- నితీశ్ ప్రామాణిక్
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ