ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజువారీగా నమోదయ్యే కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో మార్చి 5, శనివారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 23,18,338 కు చేరుకుంది. గత 24 గంటల్లో 12,916 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా, 76 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. కొత్తగా అనంతపూర్ జిల్లాలో 19, పశ్చిమగోదావరిలో 13, గుంటూరు జిల్లాలో 10, కృష్ణా జిల్లాలో 8, తూర్పుగోదావరి జిల్లాలో 7, ప్రకాశం జిల్లాలో 5, విశాఖపట్నం జిల్లాలో 4, విజయనగరం జిల్లాలో 3, చిత్తూరు జిల్లాలో 3, కడప జిల్లాలో 2, నెల్లూరు జిల్లాలో 2 కేసులు నమోదవగా, కర్నూల్, శ్రీకాకుళం జిల్లాల్లో ఎలాంటి కేసులు నమోదు కాలేదు.
ఇక కరోనా వలన మరణాలు సంభవించలేదు, దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 14,729 గా ఉంది. మరోవైపు గడిచిన 24 గంటల్లో 266 మంది కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 23,02,458 కు చేరింది. అలాగే ప్రస్తుతం 1,151 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇక మార్చి 5 నాటికీ ఏపీలో మొత్తం 3,31,67,353 కరోనా పరీక్షలను నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ