మొహాలీలోని ఐఎస్ బింద్రా స్టేడియంలో శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో రెండవరోజు భారత్ భారీ స్కోరు సాధించింది. టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (175 నాటౌట్) అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో.. భారత్ తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్లకు 574 పరుగుల భారీ స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ఆరంభించిన శ్రీలంక ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. లంక ఓపెనర్లు కరుణరత్నే (28), లహిరు తిరిమన్నె (17) మొదటి వికెట్ కు 48 పరుగులు జోడించారు. అనంతరం నిశాంక (26), మాజీ కెప్టెన్ ఏంజిలో మాథ్యూస్ (22) ఎక్కువసేపు క్రీజులో నిలువలేకపోయారు. టీమిండియా బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ 2 వికెట్లు తీయగా.. జడేజా, బుమ్రా చెరో వికెట్ తీశారు.
అయితే రెండవ రోజు ఆటలో.. భారత ఆల్రౌండర్ రవీంద్ర జడేజా బ్యాటింగ్ హైలైట్ గా నిలిచింది. మొత్తం 228 బంతులను ఎదుర్కొన్న జడేజా 175 పరుగులతో చివరి వరకు క్రీజులో నిలిచాడు. అలాగే, జడేజా అంతర్జాతీయ కెరీర్లో అత్యుత్తమ స్కోరు కూడా ఇదే కావటం గమనార్హం. ఇక ఈ మ్యాచ్లో 175 పరుగులు చేయడం ద్వారా భారత్ తరపున టెస్టుల్లో ఏడో స్థానంలో అత్యధిక స్కోరు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు కపిల్ దేవ్ (163) పేరిట ఉంది. యువ ఆటగాడు రిషభ్ పంత్ (159*) మూడో స్థానంలో ఉన్నాడు. అశ్విన్ (61) తో కలిసి ఏడో వికెట్కు 130 పరుగులు భాగస్వామ్యాన్ని అందించటం విశేషం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ