ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయాలు మళ్ళీ రాజధాని చుట్టూ తిరుగుతున్నాయి. దీనిపై మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధికార వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులకే కట్టుబడి ఉందని ఆయన మరోసారి స్పష్టం చేశారు. ఈ అంశంపై శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దీనికి సంబంధించి అసెంబ్లీలో బిల్లు పెట్టే అంశంపై కూడా ఆలోచన చేస్తున్నామని కూడా తెలిపారు. ఏపీకి మూడు రాజధానుల ఉండాలనేది తమ పార్టీ విధానమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి వికేంద్రీకరణకే వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
అమరావతిగా రాజధాని కోసం భూములు ఇచ్చిన ఆ ప్రాంత రైతులకు అభివృద్ధి చేసిన భూమిని అప్పగించాలని హైకోర్ట్ స్పష్టం చేసిన నేపథ్యంలో మంత్రి బొత్స ఈ విధంగా స్పందించారు. అలాగే, జిల్లాల పునర్విభజన అంశంపై కూడా ఆయన స్పందించారు. నూతనంగా ఏర్పాటు కానున్న జిల్లాలపై వచ్చిన వినతులను కమిటీ పరిశీలిస్తోందని తెలిపారు. వచ్చే ఉగాది నాటికి కొత్త జిల్లాల నుంచి పాలన కొనసాగనుందని మంత్రి బొత్స చెప్పారు. టీడీపీ నేతలు మాట్లాడే మాటలను తాము సీరియస్ గా తీసుకోబోమని మంత్రి బొత్స అన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ