ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్-19 మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 37,553 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 839 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా చిత్తూరులో 175, విశాఖపట్నంలో 174, కృష్ణాలో 79, తూర్పుగోదావరిలో 78, గుంటూరులో 67 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,80,602 కు చేరుకుంది.
ఇక కరోనా వలన కొత్తగా శ్రీకాకుళం మరియు పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరి చొప్పున మరణించారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 14503 కు చేరింది. గత 24 గంటల్లో 150 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 20,62,440 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,659 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ