ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏప్రిల్ 29, శుక్రవారం సాయంత్రం ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా ఏప్రిల్ 30, శనివారం నాడు ఢిల్లీలో జరగనున్న సీఎంసీజే (ముఖ్యమంత్రులు-చీఫ్ జస్టిస్ లు) సంయుక్త సదస్సులో సీఎం వైఎస్ జగన్ పాల్గొననున్నారు. సత్వర న్యాయం అందించడం, వ్యాజ్యాల పెండింగ్ సమయాన్ని తగ్గించడం, మౌలిక సదుపాయాల కల్పన మరియు న్యాయవ్యవస్థలో పెరుగుతున్న ఖాళీల భర్తీ ఎజెండాతో జరగనున్న ఈ సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించి, ప్రసంగించనున్నారు.
అలాగే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు కూడా కీలక ప్రసంగం చేయనున్నారు. ఈ సదస్సుకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు/న్యాయశాఖ మంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల నిర్వాహకులు/ లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరుకానున్నారు. ఇక పర్యటనలో ప్రధానితో సహా పలువురు కేంద్ర మంత్రులతో సీఎం వైఎస్ జగన్ భేటీ కానున్నట్టు సమాచారం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ