కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా విధించిన లాక్డౌన్ కారణంగా హైదరాబాద్లో ఉండిపోయిన కొంతమంది ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగులు ఇటీవలే తెలంగాణ ప్రభుత్వ అనుమతితో ప్రత్యేక బస్సుల్లో అమరావతి చేరుకొన్నారు. వారికీ కరోనా పరీక్షలు నిర్వహించగా ఒకరికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సచివాలయంలో వారు పనిచేసిన 3,4 బ్లాకులను తాత్కాలికంగా మూసివేసి శానిటైజ్ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇక ఈ బ్లాకుల్లో పనిచేసే ఉద్యోగులను తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకు ఇంటి నుంచే పనిచేయాలని ప్రభుత్వం కోరింది. అలాగే కరోనా సోకిన ఉద్యోగితో హైదరాబాద్ నుంచి వచ్చిన వారిని, సన్నిహితంగా మెలిగిన వారిని హోం క్వారంటైన్లో ఉండాలని అధికారులు సూచించారు. ఏవైనా కరోనా అనుమానిత లక్షణాలు ఏర్పడితే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu