ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు ఆగష్టు 27న (రేపు) సెలవు దినంగా ప్రకటించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కె. సురేష్ కుమార్ గురువారం సర్క్యులర్ జారీ చేశారు. ఆజాదీకా అమృత్ మహోత్సవాల్లో భాగంగా స్వాతంత్య్ర దినోత్సవం నిర్వహించినందున ఆగస్టు 13వ తేదీ (రెండో శనివారం) రాష్ట్రంలోని అన్ని స్కూళ్లు, ఇతర విద్యా సంస్థలకు సెలవును రద్దు చేసి పనిదినంగా ప్రకటిస్తూ స్పెషల్ జీవో విడుదల చేసిన సంగతి తెలిసిందే. దాంతో సెలవు దినంలో స్కూళ్లు పనిచేసినందున రెండో శనివారానికి బదులుగా నాలుగో శనివారం (ఆగష్టు 27) సెలవు ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించుకుంది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY