తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) లోకి చేరికలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు, వరంగల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకు అధ్యక్షుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు బీజేపీలో చేరారు. గురువారం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఎర్రబెల్లి ప్రదీప్ బీజేపీలో చేరి, కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి ప్రదీప్ కు జేపీ నడ్డా ప్రాథమిక సభ్యతాన్ని అందించి, పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఎర్రబెల్లి ప్రదీప్ ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
అలాగే ఏపీ మాజీ హౌస్ ఫెడ్ చైర్మన్, హుస్నాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ బొమ్మ శ్రీరామ్ సహా పలువురు కాంగ్రెస్ పార్టీనేతలు కూడా జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ ఛుగ్, మాజీ ఎంపీ గరికపాటి మోహన్ రావు, తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY