ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ శుక్రవారం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి రాష్ట్రమంతా తిరిగి, రెండో చోట్ల ఓడిపోయిన నాయకుడని అన్నారు. ఆయన సినిమాలలో హీరో కావచ్చేమో గాని రాజకీయాలలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయి పవన్ కు లేదని స్పష్టం చేశారు. నటుడిగా పవన్ అంటే వ్యక్తిగతంగా తనకు ఇష్టమేనని, రాజకీయాల వద్దకు వచ్చేసరికి ఎంత తక్కువుగా మాట్లాడితే అంత మంచిదని అన్నారు.
ముఖ్యమంత్రిగా రాష్ట్ర భౌగోళిక పరిస్థితులపై అవగాహన, సుదీర్ఘ పాదయాత్రలో ప్రతి ఒక్కరితో ఏర్పరుచుకున్న అనుబంధం, ప్రజలకు ఏం చేస్తే మంచి జరుగుతుందనే లక్ష్యం ఇవన్నీ కలగలిపిన నాయకుడు జగన్ మోహన్ రెడ్డి అని, ఆయనకి ఆయనే సాటి అని అన్నారు. సీఎం జగన్ తాను నమ్ముకున్న మేనిఫెస్టోను అమలు చేస్తూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. ఆయన చేపడుతున్న ప్రతి కార్యక్రమం అర్హులైన ప్రతి పేదవాడి ఇంటికి చేరుతుందని, దీనిని ప్రతిపక్ష నాయకులతో సహా ప్రతి ఒక్కరు గుర్తించాలని అన్నారు. అలాంటి సీఎంను నారా లోకేష్, పవన్ కళ్యాణ్ విమర్శించడం సబబుగా లేదని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ వ్యాఖ్యానించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ