ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ) ప్రధాన కార్యాలయాన్ని (హెడ్ క్వార్టర్స్) కర్నూలుకు మారుస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఆగస్టు 26, గురువారం నాడు నోటిఫికేషన్ జారీ చేసింది. ముందుగా ఏపీ హెచ్ఆర్సీ కార్యకలాపాలు హైదరాబాద్ నుంచే కోనసాగుతున్నాయి. అయితే 2017లో ప్రభుత్వం విజయవాడలో హెచ్ఆర్సీ కార్యాలయం ఏర్పాటుపై ఉత్తర్వులు ఇచ్చింది. తాజాగా ఆ ఉత్తర్వులకు సవరణ చేస్తూ కర్నూల్ ను ఏపీ హెచ్ఆర్సీకి హెడ్ క్వార్టర్గా స్పెసిఫై చేస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఇకపై ఏపీ హెచ్ఆర్సీ కర్నూల్ నుంచి కార్యకలాపాలు నిర్వహించనుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ