ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనితతో డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. మంగళవారం సచివాలయంలో హోంమంత్రి తానేటి వనితను డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి కలుసుకున్నారు. నూతన హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తానేటి వనితకు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సచివాలయంలోని 2వ బ్లాక్లో అడిషనల్ డీజీ రవిశంకర్, ఐజీ ప్లానింగ్ నాగేంద్రబాబు, అండ్ ఆర్డర్ డిఐజీ రాజశేఖర బాబు, ఏలూరు రేంజ్ డిఐజి పాలరాజు, ఐజీ టైనింగ్ వెంకటరామి రెడ్డి, గుంటూరు ఎస్పీ అరిఫ్ అహ్మద్, ఇతర అధికారులు సమావేశమయ్యారు. పోలీసు శాఖలోని పలు అంశాలపై ఉన్నతాధికారులతో హోంమంత్రి తానేటి వనిత కీలక చర్చలు జరిపారు. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి శాఖకు సంబంధించిన ముఖ్యమైన అంశాల గురించి, అలాగే పనితీరును గురించి హోంమంత్రి వనితకు వివరించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ