ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న పదో తరగతి పరీక్షల ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది. రేపు (శనివారం, మే 6, 2023) ఉదయం 11గంటలకు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో ఫలితాలు విడుదల చేయనున్నారు. మంత్రి బొత్స ఫలితాలను ప్రకటించిన తర్వాత పరీక్షలకు హాజరైన విద్యార్థులు తమ ఫలితాలను బోర్డు యొక్క అధికారిక వెబ్సైట్ – bse.ap.gov.inలో తనిఖీ చేసుకోవచ్చని ఏపీ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సూచించింది. కాగా రాష్ట్రవ్యాప్తంగా 3,349 కేంద్రాలలో ఏప్రిల్ 3నుంచి 18వ తేదీ వరకు పరీక్షలు జరుగగా.. 6.5 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలు రాశారు. స్పాట్ వాల్యుయేషన్ ఏప్రిల్ 19 – ఏప్రిల్ 26 మధ్య నిర్వహించబడింది. ఇక ఇటీవలే ఏపీ ఇంటర్ ఫలితాలను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేసిన విషయం తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE