ఏపీలో మొదటి దశ పంచాయతీ ఎన్నికలు, నేటి నుంచి నామినేషన్లు ప్రారంభం

Andhra Pradesh First Phase Panchayat Elections, Andhra Pradesh Government, Andhra Pradesh panchayat elections, AP First Phase Panchayat Elections, AP First Phase Panchayat Elections Nominations, AP Gram Panchayat Elections, AP Gram Panchayat Elections News, AP Local Body Polls, AP Panchayat Elections Nomination Filing Begins, AP Panchayat polls, AP Panchayat polls 2021, AP Political Updates, Mango News, Panchayat Elections Nomination Filing, Panchayat polls

ఆంధప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మొదటి దశ పంచాయతీ ఎన్నికలకు ఈ రోజు నుంచి నామినేషన్ల ఘట్టం మొదలైంది. మొదటి దశలో విజయనగరం జిల్లా మినహా రాష్ట్రవ్యాప్తంగా 3251 పంచాయతీల్లో ఫిబ్రవరి 9 న ఎన్నికలు జరగనున్నాయి. ముందుగా ఏపీ పంచాయతీ రాజ్(ఎన్నికల నిర్వహణ) నియమావళి, 6 వ నియమం కింద రిటర్నింగ్‌ అధికారులు పంచాయతీల వారీగా పారమ్-1 లోని ఎన్నికల నోటీసు జారీచేస్తారు. దీంతో జనవరి 29, 30, 31 తేదీల్లో మూడు రోజుల పాటుగా ప్రతిరోజూ ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. సర్పంచ్‌ పదవికి పోటీచేసే అభ్యర్థులతో పాటుగా వార్డు సభ్యుల పదవులకు కూడా నామినేషన్లు స్వీకరించనున్నారు. మొదటి దశలో భాగంగా 3251 పంచాయతీలు, 32,522 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి.

ఏపీ పంచాయతీ ఎన్నికల ముఖ్య తేదీలు: ఫేజ్-1

  • నోటిఫికేషన్ జారీ: జనవరి 27
  • నామినేషన్ల స్వీకరణ: జనవరి 29
  • నామినేషన్ చివరి రోజు: జనవరి 31
  • నామినేషన్ల పరిశీలన: ఫిబ్రవరి 1
  • ఉపసంహరణ చివరి తేదీ: ఫిబ్రవరి 4
  • ఎన్నికల తేదీ: ఫిబ్రవరి 9
  • లెక్కింపు తేదీ: ఫిబ్రవరి 9
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 2 =