కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా మే 31 వ తేదీ వరకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ ను పొడిగిస్తునట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మే 31 వరకు లాక్డౌన్ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని దేవాలయాల్లో దర్శనాలపై కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, మే 31 వరకు రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లోకి భక్తుల ప్రవేశానికి అనుమతి లేదని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ లాక్డౌన్ సమయంలో దర్శనాలను పూర్తిగా నిలిపిస్తున్నట్లు తెలిపారు. దర్శనాలకు సంబంధించి గతంలో ఇచ్చిన ఆదేశాలనే యధావిధిగా కొనసాగించాలని మంత్రి స్పష్టం చేశారు. మరోవైపు దేవాలయాల్లో సాంప్రదాయాలను అనుసరించి నిత్య పూజలు కొనసాగుతాయని చెప్పారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu