నటుడు నందమూరి తారకరత్న త్వరగా కోలుకోవాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. “నటుడు నందమూరి తారకరత్న కుప్పంలో తీవ్ర అస్వస్థతకు లోను కావడం బాధాకరం. మెరుగైన చికిత్స కోసం బెంగళూరు తరలిస్తున్నారని సమాచారం అందింది. తారకరత్న త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను. సంపూర్ణ ఆరోగ్యవంతులై తిరిగి తన రోజువారీ కార్యక్రమాల్లో నిమగ్నం కావాలని ఆకాంక్షిస్తున్నాను” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
ముందుగా శుక్రవారం నాడు కుప్పంలో నారా లోకేష్ చేపడుతున్న తొలిరోజు ‘యువగళం’ పాదయాత్ర పూజా కార్యక్రమాల్లో నందమూరి తారకరత్న పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం పాదయాత్ర సిద్దమవుతున్న సమయంలో తారకరత్న తీవ్ర గుండెపోటు గురయ్యారు. వెంటనే పార్టీ నేతలు, వ్యక్తిగత సిబ్బంది తారకరత్నను కుప్పంలోని కేసీ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం పీఈఎస్ వైద్య కళాశాలకు తీసుకెళ్లి చికిత్స అందించారు. ఇక వైద్యుల నిర్ణయం మేరకు శుక్రవారం అర్ధరాత్రి ప్రత్యేక అంబులెన్స్లో తారకరత్నను బెంగళూరుకు తరలించారు. ప్రస్తుతం ఆయనకు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో వైద్య నిపుణుల పర్యవేక్షణలో చికిత్స కోనసాగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ, నారా లోకేష్, ఇతర కుటుంబ సభ్యులు తారక రత్న ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుంటున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE