మొదటివిడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ రేపే, అన్ని ఏర్పాట్లు పూర్తి

Andhra Pradesh Government, Andhra Pradesh panchayat elections, AP First Phase Panchayat Elections, AP First Phase Panchayat Polls, AP Gram Panchayat Elections, AP Gram Panchayat Elections News, AP Local Body Polls, AP Panchayat Elections, AP Panchayat polls, AP Panchayat polls 2021, AP Political Updates, Mango News, Panchayat polls

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటివిడతలో భాగంగా మొత్తం 12 జిల్లాల్లో 2,724 పంచాయతీలు, 20,157 వార్డులకు రేపు (ఫిబ్రవరి 9, మంగళవారం) ఎన్నికలు జరగనున్నట్టు రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది వెల్లడించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, మొదటివిడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. 12 జిల్లాల్లోని 3,249 పంచాయతీల్లో 525 చోట్ల ఏకగ్రీవం అయిందని, 32,502 వార్డులకు 12,185 చోట్ల ఏకగ్రీవమైనట్లు చెప్పారు. దీంతో 2,724 పంచాయతీలు, 20,157 వార్డుల్లో ఎన్నికల నిర్వహణ కోసం 29,732 పోలింగ్‌ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేసినట్టు పేర్కొన్నారు. ఇక గుంటూరు, చిత్తూరు జిల్లాలలో జరిగిన ఏకగ్రీవాలపై ఎస్‌ఈసీ ఆదేశాల ప్రకారం నిర్ణయం తీసుకుంటామన్నారు.

ఈసారి పంచాయతీ ఎన్నికల్లో తొలిసారిగా నోటా గుర్తు కూడా ప్రవేశపెట్టామన్నారు. నోటా గుర్తుకు పడిన ఓట్ల లెక్కింపు జరగదని స్పష్టం చేశారు. వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ పక్రియను పర్యవేక్షిస్తామన్నారు. కరోనా నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని‌ జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ఎన్నికల సిబ్బందికి గ్లోజులు, మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేసినట్టు తెలిపారు. మరోవైపు ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ జరగనుండగా, 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు పక్రియను ప్రారంభించనున్నారు. ఫలితాల అనంతరం ఉపసర్పంచ్ ఎన్నిక కూడా చేపట్టనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + 14 =