రాష్ట్రంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి, ఇంటర్ పరీక్షలను రద్దు చేస్తున్నట్టుగా ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. గురువారం సాయంత్రం మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడుతూ, జూలై 31 లోగా ఇంటర్మీడియట్ ఫలితాలను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో ఈ నిర్ణీత గడువులోగా ఇంటర్ పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం సాధ్యం కాదని అన్నారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, పరీక్షలు రద్దుపై నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మార్కులకు సంబంధించి, విధి విధానాలను రూపకల్పన కోసం హైపవర్ కమిటీని ఏర్పాటు చేస్తామని, అనంతరం ఫలితాలు విడుదలపై మార్గదర్శకాలు ప్రకటిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ