వైఎస్ షర్మిల జూన్ 25, శుక్రవారం నాడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు వైఎస్ షర్మిల కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఉదయం 7 గంటలకు హైదరాబాద్ లోని లోటస్పాండ్ నుంచి కరీంనగర్ జిల్లా పర్యటనకు వైఎస్ షర్మిల బయల్దేరి వెళ్లనున్నట్టు తెలిపారు. కరోనా కారణంగా ఇటీవల మరణించిన పలు కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. అలాగే ఈ పర్యటనలో భాగంగా చేనేత కార్మికులను కూడా కలుసుకొని వారి కష్టాలు తెలుసుకొని భరోసానివ్వనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ