ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 33,339 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 547 కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కోవిడ్ యాక్టివ్ కేసులు 2286 ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలో మొత్తం 236 ఆసుపత్రుల్లో కోవిడ్ పేషంట్స్ కి చికిత్స అందిస్తున్నారు. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 334. వీరు కాకుండా హోమ్ క్వారంటైన్ ఐసోలేషన్లో 1952 మంది ఉన్నవారని ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఏపీ వైద్యఆరోగ్యశాఖ గురువారం హెల్త్ బులెటిన్ను విడుదల చేసింది.
ఒమిక్రాన్ వ్యాప్తిపై కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి. ప్రత్యేకంగా, కోవిడ్ హాస్పిటల్స్ పై దృష్టి సారించాయి. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ముందస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు అందాయి. ఆంధ్రప్రదేశ్ లో అన్ని జిల్లాల వైద్య అధికారులను.. వైద్య ఆరోగ్య శాఖ అలర్ట్ చేసింది. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కోవిడ్ కేర్ సెంటర్లు అప్రమత్తమయ్యాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బెడ్లు, ఆక్సిజన్ కొరత ఉండకుండా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ