ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోలవరం ప్రాజెక్టులో ప్రధాన భాగమైన ఎగువ కాఫర్ డ్యామ్ ఎత్తు పెంచాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు యుద్ధప్రాతిపదికన కాఫర్ డ్యామ్ ఎత్తు ఒక మీటర్ మేర పెంచటానికి అనుమతిచ్చింది. సత్వరమే పనులు చేపట్టాలని అధికారులకి ఆదేశాలిచ్చింది. ప్రస్తుతం వస్తున్న భారీ వరదను మరియు భవిష్యత్తులో ఎదుర్కోబోయే వరదలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఎత్తు పెంచడంతో పాటుగా డ్యామ్ ను మరింతగా పటిష్టపరిచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. కాగా ప్రస్తుతం ఎగువ కాఫర్ డ్యామ్ 42.5 మీటర్ల ఎత్తున నిర్మించారు. అయితే తాజా నిర్ణయంతో ముందస్తు చర్యల్లో భాగంగా ఒక మీటర్ మేర ఎత్తు పెంపు, రెండు మీటర్ల వెడల్పున మట్టి, ఇసుకను ఉపయోగించి డ్యామ్ ను పటిష్ఠపరచాలని నిర్ణయించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ