దేశ వ్యాప్తంగా కరోనా విశ్వరూపం చూపిస్తోంది. మన దేశంలో కూడా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే.. టాలీవుడ్లో కరోనా కలకలం సృష్టిస్తుంది. టాలీవుడ్ సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా కోవిడ్ బారిన పడుతున్నారు. ప్రతి రోజూ ఎవరో ఒకరు దీని బారిన పడుతూనే ఉన్నారు. ఇప్పటికే, మంచు మనోజ్, విష్వక్ సేన్, మంచు లక్ష్మి, మహేష్ బాబు కోవిడ్ బారిన పడ్డారు. తాజాగా, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. థమన్కు సైతం కోవిడ్-19 పాజిటివ్ గా తేలింది. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్లో ఉన్నారు. గత కొన్ని రోజులుగా తనను కలుస్తున్న వారందరూ తప్పకుండా కరోనా పరీక్షలు చేయించుకోవాలని తమన్ కోరారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ