ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్చి 10న 12 కార్పోరేషన్స్, 75 మునిసిపాలిటీలు/నగర పంచాయతీలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలింగ్ సందర్భంగా మార్చి 10న ఆయా కార్పోరేషన్స్, మునిసిపాలిటీలు పరిధిలో సెలవు ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం సోమవారం నాడు ఉత్వర్వులు జారీ చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్ ఇవ్వాలని సంబంధిత కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఆదేశించారు.
మునిసిపల్ ఎన్నికలు జరిగే నగరాలు, పట్టణాల్లోని ప్రభుత్వ, పారిశ్రామిక రంగ, వ్యాపార సంస్థలు తమ ఉద్యోగులకు పోలింగ్ రోజున పెయిడ్ సెలవును ప్రకటించాలని, ఇందుకు ప్రత్యామ్నాయంగా మరో సెలవు రోజున పనిదినంగా ప్రకటించాలని సూచించారు. అలా అవకాశం కుదరకపోతే ఓటు హక్కును వినియోగించుకునేందుకు 3 గంటల పాటుగా ఉద్యోగులకు వెసులుబాటు కల్పించాలని పేర్కొన్నారు. అలాగే పోలింగ్ జరిగే రోజుకు 48 గంటలకు ముందు ఆయా ప్రాంతాల్లో మద్యం విక్రయాలను నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ