ఆంధ్రపప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నాడు వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్ 3 వ విడత నిధులు, నివర్ తుపాను కారణంగా నష్టపోయిన వ్యవసాయ, ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ చెల్లింపులను ప్రారంభించారు. 3వ విడత రైతుభరోసా రూ.1,120 కోట్లు, నివర్ తుపాను పరిహారం కింద రూ.646 కోట్లు కలిపి మొత్తంగా రూ.1,766 కోట్లను కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా రైతుల ఖాతాల్లో నేరుగా జమచేసే పక్రియను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ చరిత్రలో ఎన్నడూ లేనంత వేగంగా పంట నష్టపరిహారం, సంక్రాంతికి ముందే రైతుభరోసా నిధులు విడుదల చేస్తున్నామని చెప్పారు. రైతుబాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మి రైతు పక్షపాత విధానాలు తెచ్చిన ప్రభుత్వం ఇదని పేర్కొన్నారు. వైఎస్ఆర్ రైతు భరోసా, సున్నా వడ్డీ బకాయిలు, వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ, ఉచిత విద్యుత్, గ్రామాల్లో గోడౌన్లు, ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్లు ఏర్పాటు ఇలా రాష్ట్రంలో రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు సంక్షేమ కార్యక్రమాల గురించి సీఎం వైఎస్ జగన్ వివరించారు.
రైతుబాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మి రైతు పక్షపాత విధానాలు తెచ్చిన ప్రభుత్వం మనదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 3వ విడత రైతుభరోసా రూ.1,120 కోట్లు, నివర్ తుపాను పరిహారం కింద రూ.646 కోట్లు, మొత్తంగా రూ. 1,766 కోట్లను రైతుల ఖాతాల్లో జమచేస్తున్నామని సీఎం వైయస్ జగన్ తెలిపారు. (2/2)
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) December 29, 2020
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ