ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఫిబ్రవరి 23, మంగళవారం నాడు వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ కేబినెట్ భేటీలో పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం ముగిసిన అనంతరం మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని మీడియాకు వివరించారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలు:
- ఈబీసీ నేస్తం పథకానికి రూ.670 కోట్లతో కేబినెట్ ఆమోదం. అగ్రవర్ణాల్లో ఆర్ధిక వెనుకబాటు కలిగిన 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు గల మహిళలకు 2021-22 నుంచి 15 వేలు చొప్పున మూడేళ్ల పాటుగా 45 వేలు రూపాయలను ఈ పథకం కింద అందించనున్నారు.
- ఇప్పటివరకు నవరత్నాలు సహా ప్రజలకు అందజేసిన 23 పథకాలకు సంబంధించి ఈ ఏడాది క్యాలెండర్ కు (ఏప్రిల్ నుంచి జనవరి వరకు) కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ క్యాలెండర్ కు అనుగుణంగా అమలు పరిచే పథకాల ద్వారా సుమారు 8 కోట్ల మంది లబ్ధిదారులకు మేలు జరగనుందని చెప్పారు.
- పట్టణ ప్రాంతాల్లో 300 చదరపు అడుగులలోపు ఉండే ఇళ్లు/అపార్టుమెంట్లను 1,43,600 మందికి రూపాయికే రిజిస్ట్రేషన్ చేసి త్వరలో అప్పజెప్పేందుకు నిర్ణయం.
- కొత్తగా ఏప్రిల్ 2021 నుంచి వచ్చే ప్రైవేట్ లేఔట్ల అన్నింటిలో 5 శాతం భూమి పేదవర్గాలకు కేటాయించేలా ప్రభుత్వానికి బదలాయించేందుకు చట్టసవరణకు కేబినెట్ ఆమోదం.
- రైతుభరోసా కేంద్రాలకు అనుసంధానంగా మల్టీ పర్ఫస్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు.
- చిత్తూరు జిల్లాలో పెనుమూరు, కార్వేటి లలో పీహెఛ్సీ లను 50 పడకల ఆసుపత్రులుగా అప్గ్రేడేషన్.
- రాజధాని అమరావతి పరిధిలో ఉన్న అసంపూర్తి భవనాల నిర్మాణాలు పూర్తి చేసునేందుకు అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అధారిటీ (ఏఎంఆర్డీఏ) కు రూ.3 వేల కోట్ల బ్యాంకు గ్యారంటీ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం.
- విశాఖ ఉక్కుపరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం పెట్టాలని కేబినెట్ నిర్ణయం.
- ఏపీ గేమింగ్ యాక్టు –1974 సవరణకు ఆమోదం.
- వైఎస్ఆర్ కడప జిల్లాలో స్టీల్ ప్లాంటు నిర్మాణానికి జాయింట్ వెంచర్ ఎంపిక ప్రక్రియకు కేబినెట్ ఆమోదం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ