వైఎస్సార్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (సెప్టెంబర్ 20, మంగళవారం) వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. ముందుగా ఈ భేటీ సోమవారమే ఉంటుందని తెలుపగా, తాజాగా మంగళవారానికి వాయిదా పడినట్టు ప్రకటించారు. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో మంగళవారం సమావేశాల అనంతరం పార్టీ ఎమ్మెల్యేలతో సీఎం వైఎస్ జగన్ సమావేశం కానున్నారు
మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ చార్జులు, రీజనల్ కోఆర్డినేటర్లు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమ నివేదికలు, నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పని తీరు, ఇంకా చేపట్టాల్సిన కార్యక్రమాలు, వచ్చే ఎన్నికల్లో టికెట్ల అంశంపై ఈ సమావేశంలో కీలకంగా చర్చించనున్నట్టు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY