దేశంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పలు పార్టీల కీలక నేతలు సైతం కరోనా బారినపడ్డారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ అహ్మద్ పటేల్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ ద్వారా స్వయంగా వెల్లడించారు. “నాకు కోవిడ్-19 పాజిటివ్ గా తేలింది. ఇటీవల నాతో సన్నిహితంగా ఉన్న వారందరూ, ఇతరులతో వేరుగా ఉండి సెల్ఫ్ ఐసొలేషన్ లో ఉండమని అభ్యర్థిస్తున్నాను” అని అహ్మద్ పటేల్ ట్వీట్ చేశారు.
I have tested positive for Covid19. I request all those who came in close contact with me recently, to self isolate
— Ahmed Patel (@ahmedpatel) October 1, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu