ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వైస్ చైర్మన్, ఎండీగా ఆర్పీ ఠాకూర్ ను నియమిస్తూ జనవరి 13, బుధవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ప్రింటింగ్, స్టేషనరీ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న ఆయనను ఆర్టీసీ ఎండీగా నియమించారు. తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు ప్రింటింగ్, స్టేషనరీ కమిషనర్ గా కూడా ఆయన అదనపు బాధ్యతలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. 1986 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి అయిన ఆర్పీ ఠాకూర్ గత టీడీపీ ప్రభుత్వహయాంలో డీజీపీగా, అంతకుముందు ఏసీబీ డీజీగా కూడా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. మరోవైపు ఇప్పటివరకు సీనియర్ ఐఏఎస్ అధికారి కృష్ణబాబు ఆర్టీసీ ఎండీగా అదనపు బాధ్యతలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ