తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో గా విధులు నిర్వహించిన అనిల్కుమార్ సింఘాల్ ను బదిలీ చేసి వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీటీడీ నూతన ఈవోగా సీనియర్ ఐఏఎస్ అధికారి కేఎస్ జవహర్ రెడ్డిని అక్టోబర్ 7, బుధవారం నాడు ఏపీ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. కేఎస్ జవహర్రెడ్డి ప్రస్తుతం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu