ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆగస్టు 15, స్వాతంత్య్ర దినోత్సవం నాడు దాదాపు 30 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని భావించింది. అయితే ఇళ్ల పట్టాల పంపిణీ అంశంపై కోర్టులో విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని మరోసారి వాయిదా వేసింది. మరోవైపు అక్టోబర్ 2న ఇళ్ల పట్టాల పంపిణీ చేపట్టాలని భావిస్తున్నట్లుగా తెలుస్తుంది.
ముందుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి రోజైన జూలై 8 వ తేదీన ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులను దృష్ట్యా ఈ కార్యక్రమాన్ని ఆగస్టు 15 కి వాయిదా వేశారు. తాజాగా కోర్టు విచారణ నేపథ్యంలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ మరోసారి వాయిదా పడింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu