మెదక్ జిల్లాలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో నవంబర్ 3 న ఉప ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. దుబ్బాక ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా చెరుకు శ్రీనివాస్ రెడ్డిని ప్రకటించారు. బుధవారం నాడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం అధికారికంగా ప్రకటించింది. మరోవైపు ఇప్పటికే అధికార టిఆర్ఎస్, బీజేపీ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా దివంగత మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భార్య సోలిపేట సుజాత పేరును ఖరారు చేయగా, సీనియర్ నాయకుడు ఎం.రఘునందన్ రావు బీజేపీ అభ్యర్థిగా ఈ ఉపఎన్నికల్లో బరిలో నిలిచారు. కీలక పార్టీల అభ్యర్థులు ఖరారు కావడంతో దుబ్బాకలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది.
దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక షెడ్యూల్:
- నోటిఫికేషన్ జారీ తేదీ: అక్టోబర్ 9
- నామినేషన్ల దాఖలుకు ఆఖరి తేదీ: అక్టోబర్ 16
- నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 17
- నామినేషన్ల ఉపసంహరణ గడువు: అక్టోబర్ 19
- పోలింగ్ తేదీ: నవంబర్ 3
- ఓట్ల లెక్కింపు పక్రియ: నవంబర్ 10
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu