శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) నూతన చైర్మన్ గా రాజ కుటుంబీకుడు, మాజీ ఎమ్మెల్యే సాయికృష్ణ యాచేంద్ర నియమితులు అయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముందుగా ఎస్వీబీసీ ఛైర్మన్గా ఉన్న సినీనటుడు పృథ్వీరాజ్ ఆ పదవికి రాజీనామా చేశాక, చైర్మన్ పదవికి వెంటనే ఎవరిని నియమించలేదు. ఆ తర్వాత టీటీడీ ఆధ్వర్యంలో నడిచే ఎస్వీబీసీ ఛానల్ కు ఎండీగా టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డిని నియమించారు. చైర్మన్ నియామకంలో భాగంగా ఎస్వీబీసీలో డైరెక్టర్లుగా ఉన్న జర్నలిస్టు స్వప్న, డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి ల పేర్లు కూడా తెరపైకి వచ్చినప్పటికీ, సాయికృష్ణ యాచేంద్రను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సాయికృష్ణ యాచేంద్ర 1985లో నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్: