ఆంధ్రప్రదేశ్లో 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేడుకల కోసం సుందరంగా ముస్తాబు చేసిన విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి చేరుకొని జాతీయ జెండాను ఎగురవేశారు. ఆ తరువాత పోలీసుల గౌరవవందనాన్ని ముఖ్యమంత్రి స్వీకరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలందరికీ 73వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, డీజీపీ గౌతమ్ సవాంగ్, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
[subscribe]
[youtube_video videoid=O_IIFqJfHbY]